India: కుల్ దీప్ యాదవ్... ఆ సైగలు ఎవరికోసం? ఎందుకోసం?: నెట్టింట హాట్ టాపిక్!

  • దక్షిణాఫ్రికాతో తొలి మ్యాచ్ లో డగౌట్ కే పరిమితమైన కుల్ దీప్
  • కెమెరా తనవైపు తిప్పిన వేళ చేతులతో సైగలు
  • నెట్టింట వైరల్ కాగా, వివిధ రకాల కామెంట్లు

గత రాత్రి దక్షిణాఫ్రికా, ఇండియా మధ్య జరిగిన తొలి టీ-20 మ్యాచ్ కి గాయాల కారణంగా దూరమై డగౌట్ కే పరిమితమైన బౌలర్ కుల్ దీప్ యాదవ్ పై ఇప్పుడు నెట్టింట చర్చ సాగుతోంది. విశ్రాంతి తీసుకుంటూ తన వైపు కెమెరా ఫోకస్ అయిందని తెలుసుకున్న కుల్ దీప్ చేసిన సైగలే ఇందుకు కారణం. ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా జట్టు ఛేదనలో తడబడుతున్న వేళ, భారత విజయం అప్పటికే ఖరారైన నేపథ్యంలో, రెండు చేతులనూ కంటి ముందు పెట్టుకుని, గుండ్రంగా తిప్పుతూ కుల్ దీప్ కొన్ని సైగలు చేశాడు.

ఆ సమయంలో తదుపరి వికెట్ పడితే, ఆడేందుకు వెళ్లే నిమిత్తం సౌతాఫ్రికా ప్లేయర్ షమీ కూడా కెమెరాలో కనిపించాడు. ఇక కుల్ దీప్ సైగల వెనుక ఆంతర్యం ఏంటని చర్చ సాగుతుండగా, ఎవరికి తోచిన కామెంట్ ను వారు పెడుతున్నారు. తనను చూపించకుండా ఓడిపోతున్న దక్షిణాఫ్రికాను చూపించాలని అతను చెబుతున్నారని ఒకరు వ్యాఖ్యానిస్తే, ఇప్పుడు మరో వికెట్ పోతుంది, కెమెరా అటు వైపు తిప్పండి అని అన్నాడని మరో నెటిజన్ జోకేశాడు. ఇప్పుడిక షమీ వంతు అన్నట్టు కుల్ దీప్ సైగ చేశాడని మరొకరు కామెంట్ పెట్టారు. ఈ మ్యాచ్ లో భారత జట్టు 28 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

More Telugu News