nagachaitanya: చకచకా రెడీ అవుతోన్న 'సవ్యసాచి' .. ఆ రోజునే వస్తాడట!

  • షూటింగు దశలో 'సవ్యసాచి'
  • కథానాయికగా నిధి అగర్వాల్ 
  • మే 24వ తేదీన విడుదల

నిఖిల్ తో 'కార్తికేయ' చేసి హిట్ కొట్టిన చందూ మొండేటి .. ఆ తరువాత నాగచైతన్యతో 'ప్రేమమ్' చేసి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ కారణంగానే నాగచైతన్యతో మరో సినిమా చేసే ఛాన్స్ ఆయనకి దక్కింది.ఈ సినిమాకి 'సవ్యసాచి' అనే టైటిల్ ను ఖరారు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ - అన్నపూర్ణ స్టూడియోలో చకచకా జరిగిపోతోంది.

యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది.  మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాను మే 24వ తేదీన విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. దాదాపుగా ఈ డేట్ ఖరారైపోయినట్టేనని అంటున్నారు. ఇక ఈ సినిమాతో పాటు మారుతి దర్శకత్వంలో చైతూ 'శైలజా రెడ్డి అల్లుడు' కూడా చేస్తున్నాడు. ఈ సినిమాలో కీలకమైన పాత్రను రమ్యకృష్ణ చేస్తోన్న విషయం తెలిసిందే

More Telugu News