Rakul: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • సెకండ్ హీరోయిన్ పాత్రలు చేయనంటున్న రకుల్
  • మెగా హీరో సరసన నాయికగా రుక్సార్
  • వాయిదా పడిన నాగశౌర్య సినిమా 
  • ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రామ్  

*  తాజాగా 'అయ్యారీ' హిందీ చిత్రంలో నటించిన రకుల్ ప్రీత్ సింగ్ తాను బాలీవుడ్ లో సెకండ్ లీడ్ రోల్స్ చేయనని చెప్పింది. "అయ్యారీలో నేను హీరోయిన్ గా నటించాను. ముందుముందు కూడా ఇలాగే హీరోయిన్ గానే నటిస్తాను. సెకండ్ లీడ్ రోల్స్ మాత్రం చేయను" అని చెప్పింది. ఇక 'అయ్యారీ' చిత్రం తనకు బాలీవుడ్ లో మంచి ఆఫర్లు తెచ్చిపెడుతుందని ఈ చిన్నది ఆశగా వుంది.
*  తాజాగా 'కృష్ణార్జున యుద్ధం' చిత్రంలో నాయికగా నటిస్తున్న రుక్సార్ మీర్ కు మెగా హీరో సరసన నటించే ఛాన్స్ వచ్చింది. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో సాయిధరం తేజ్ హీరోగా ఓ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రంలో రుక్సార్ ను నాయికగా తీసుకున్నట్టు సమాచారం.    
*  నాగశౌర్య, సాయిపల్లవి నటించిన 'కణం' చిత్రం విడుదల వాయిదా పడింది. వాస్తవానికి ఈ నెల 23న ఈ చిత్రం విడుదల కావలసివుంది. అయితే, అనివార్య కారణాల వల్ల వచ్చే నెల 3కి దీనిని వాయిదా వేశారు.
*  రామ్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుంది. భవ్య క్రియేషన్స్ సంస్థ వీరి కాంబినేషన్లో చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.     

More Telugu News