Narendra Modi: లోక్‌సభ ఎన్నికల పరీక్షను మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు?: మోదీకి విద్యార్థి షాకింగ్ ప్రశ్న

  • 'పరీక్షా పే చర్చా' పేరుతో విద్యార్థులతో మోదీ ముచ్చట
  • సూటిగా సమాధానం చెప్పలేకపోయిన మోదీ
  • నేను నీకు టీచర్‌ను అయి ఉంటే కచ్చితంగా జర్నలిజం వైపు వెళ్లాలని సలహా ఇస్తా: మోదీ
  • ఎందుకంటే జర్నలిస్టులు మాత్రమే ఇలాంటి మెలిక ఉండే ప్రశ్నలు వేస్తారు

'పరీక్షా పే చర్చా' పేరుతో ఈ రోజు ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీ ఢిల్లీలోని తల్కోతోరా స్టేడియంలో విద్యార్థుల‌కు సూచనలు ఇస్తోన్న విషయం తెలిసిందే. ప‌రీక్ష‌లు స‌మీపిస్తోన్న నేప‌థ్యంలో విద్యార్థులు ఎలా సిద్ధం కావాలో, ఆత్మవిశ్వాసంతో ఎలా ఉండాలో ఆయన చెబుతున్నారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతున్నారు. కాగా, ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు మోదీ సమాధానం చెప్పలేకపోయారు.
 
వచ్చే లోక్‌సభ ఎన్నికల పరీక్షను మీరు ఎలా ఎదుర్కోబోతున్నారో చెప్పాలని ఓ విద్యార్థి అడిగాడు. దానికి మోదీ సూటిగా సమాధానం చెప్పలేక, తాను గనక ఆ విద్యార్థికి టీచర్‌ను అయిఉంటే కచ్చితంగా అతడిని జర్నలిజం వైపు వెళ్లాలని సలహా ఇస్తానని, ఎందుకంటే జర్నలిస్టులు మాత్రమే ఇలాంటి మెలిక ఉండే ప్రశ్నలు వేస్తారని వ్యాఖ్యానించారు.  

More Telugu News