sumanth: వరుస సినిమాలు ఒప్పేసుకుంటోన్న సుమంత్!

  • థ్రిల్లర్ కాన్సెప్ట్ తో రానున్న సుమంత్
  • కథానాయికగా అంజు కురియన్ 
  • దర్శకుడు అనిల్ తో త్వరలోనే సెట్స్ పైకి

కథానాయకుడిగా సుమంత్ తన కెరియర్ ను ప్రారంభించి చాలాకాలమే అయినా, సత్యం .. మహానంది .. గోదావరి .. మధుమాసం వంటి కొన్ని సినిమాలే ఆయనకు మంచి గురింపును తెచ్చి పెట్టాయి. ఇక కొంతకాలంగా ఆయన సినిమాల సంఖ్యను బాగా తగ్గించాడు .. చేసిన కొన్ని కూడా నిరాశనే మిగిల్చాయి. ఇలాంటి నేపథ్యంలో మరో సినిమాను చేయడానికి ఆయన రెడీ అవుతున్నాడు.

ఈ సినిమా ద్వారా అనిల్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా కొనసాగనుందని సమాచారం. అంజు కురియన్ కథానాయికగా నటించనున్న ఈ సినిమాకి, 'ఇదమ్ జగత్' అనే టైటిల్ ను ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్నట్టు చెబుతున్నారు. యువ దర్శకులు కొత్త కంటెంట్ తో ముందుకు వస్తుండటంతో, నాలుగు సినిమాల వరకూ ఒప్పుకున్నాడట. ఇదంతా చూస్తుంటే సుమంత్ స్పీడ్ పెంచినట్టుగా అనిపించడం లేదూ!
 

More Telugu News