charan: 'రంగస్థలం'లో కావాల్సినంత కామెడీ!

  • పడవ నడిపే చిట్టిబాబు పాత్రలో చరణ్
  • ఆయన వినికిడి లోపం నుంచే హాస్యం 
  • మార్చి 30వ తేదీన రికార్డు స్థాయిలో రిలీజ్  

సుకుమార్ దర్శకత్వంలో 'రంగస్థలం' చిత్రం తెరకెక్కింది. గోదావరి జిల్లాల్లో గోదావరి తీరంలోని అందమైన పల్లెల్లో ఈ సినిమా షూటింగ్ చాలావరకూ కొనసాగింది. ఈ సినిమాలో పడవ నడిపే చిట్టిబాబు పాత్రలో చరణ్ .. రామలక్ష్మి పాత్రలో సమంత నటించారు. ఈ ఇద్దరికీ సంబంధించిన లుక్స్ ఆడియన్స్ ను ఒక రేంజ్ లో ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో కావాల్సినంత కామెడీ ఉంటుందని అంటున్నారు.

 ఈ సినిమాలో చిట్టిబాబుకి వినికిడి లోపం ఉంటుంది. ఈ అంశంపైనే హాస్యాన్ని పండించినట్టు చెబుతున్నారు. సాధారణంగా సుకుమార్ సినిమాల్లో హాస్యం తక్కువగా ఉంటుంది. ఈ విషయంపై దృష్టి పెట్టి .. కామెడీ తగ్గకుండా చూసుకోమని సుకుమార్ కి చిరంజీవి ముందుగానే సూచినట్టు వార్తలు వచ్చాయి కూడా. అందువల్లనే ఆయన చిట్టిబాబు పాత్ర ద్వారానే కావాల్సినంత కామెడీని పిండేశాడని చెప్పుకుంటున్నారు. మార్చి 30వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు.  

More Telugu News