YSRCP: కేంద్ర బడ్జెట్ బాగుందని చంద్రబాబు స్వీట్లు పంచారు: ఎంపీ మిథున్ రెడ్డి ఆరోపణ

  • నాడు రాష్ట్రం విడగొట్టేప్పుడూ చంద్రబాబు డ్రామాలు ఆడారు
  • బడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరిగిందంటూ ఇప్పుడూ  డ్రామాలు
  • ప్రజలకు అబద్ధాలకు చెప్పి చంద్రబాబు మభ్యపెడుతున్నారు
  • మీడియాతో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి 

కేంద్ర బడ్జెట్ బాగుందంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్వీట్లు పంచారంటూ వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఆరోపించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, నాడు రాష్ట్రం విడగొట్టేప్పుడూ చంద్రబాబు డ్రామాలు ఆడారని, కేంద్ర బడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరిగిందంటూ ఇప్పుడూ ఆయన డ్రామాలాడుతున్నారని విమర్శించారు.

ఇటీవల జరిగిన విశాఖ సమ్మిట్ లో రాష్ట్రానికి ఐదు లక్షల ఉద్యోగాలొచ్చాయని చంద్రబాబు చెప్పారని, అదంతా అబద్ధమని, ప్రజలను ఆయన మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా సాధన కోసం తమ పార్టీ ఎంపీలు రాజీనామాలకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో టీడీపీ రాద్ధాంతం చేయడం సబబు కాదని అన్నారు. గతంలో తమను రాజీనామా చేయలేదేమని అడిగారని, ఇప్పుడు రాజీనామాలు చేస్తామంటే ఎన్నికలు రావని టీడీపీ వ్యాఖ్యలు చేస్తోందని విమర్శించారు. 

More Telugu News