nagashourya: మహేశ్ పాటలో నుంచి నాగశౌర్య న్యూ మూవీ టైటిల్

  • 'ఛలో'తో హిట్ కొట్టిన నాగశౌర్య 
  • షూటింగు దశలో 'అమ్మమ్మగారిల్లు'
  • త్వరలో కాశీ విశ్వనాథ్ తో సెట్స్ పైకి

నాగశౌర్య హీరోగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ఛలో' సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తరువాత నాగశౌర్య 'అమ్మమ్మగారిల్లు'తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే ప్రముఖ కేరెక్టర్ నటుడు కాశీ విశ్వనాథ్ వినిపించిన కథకు నాగశౌర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. గతంలో కాశీ విశ్వనాథ్ 'నువ్వులేక నేను లేను' .. 'తొలిచూపులోనే' వంటి సినిమాలను తెరకెక్కించాడు. ఆ తరువాత కేరెక్టర్ నటుడిగా మారి, పలు సినిమాలలో నటిస్తూ వచ్చాడు.

చాలా గ్యాప్ తరువాత, నాగశౌర్యతో ఆయన ఈ సినిమా చేస్తూ, మళ్లీ మెగా ఫోన్ పడుతున్నాడు. ఈ సినిమాకి 'గురువారం మార్చి 1'అనే టైటిల్ ను ఖరారు చేసుకున్నారు. మహేశ్ బాబు సినిమా 'దూకుడు'లో 'గురువారం మార్చి 1' అంటూ ఒక పాట మొదలవుతుందనే విషయం తెలిసిందే. పాప్యులర్ అయిన ఆ పాటలో నుంచే ఈ టైటిల్ ను సెట్ చేశారు. 'ఏ మాయ చేశావే' .. 'సాహసం శ్వాసగా సాగిపో' టైటిల్స్ కూడా మహేశ్ బాబు పాటల్లో నుంచి పుట్టుకొచ్చినవే. 

More Telugu News