Xiaomi TV: ఇండియాకి వచ్చేసిన షియోమీ ఎంఐ టీవీ4 !

  • భారత మార్కెట్ లోకి షియోమీ ఎంఐ టీవీ4
  • ధర రూ.39,999
  • 11 బటన్లతో రిమోట్

భారత స్మార్ట్ ఫోన్ల మార్కెట్లో అగ్ర స్థానానికి చేరుకున్న చైనా కంపెనీ షియోమీ తాజాగా ఎంఐ టీవీ4 ని ఇండియా లో లాంచ్ చేసింది. ఇండియాలో దీని ధర రూ.39,999 గా ఉంది. 11 బటన్లతో దీని రిమోట్ పనిచేస్తుంది. ఫిబ్రవరి 22వ తేదీ నుంచి ఫ్లిప్ కార్ట్, ఎంఐ స్టోర్లలో సేల్స్ ప్రారంభం అవుతాయని తెలియజేసింది.

షియోమీ ఎంఐ టీవీ4 ఫీచర్లు:

  • 55" స్క్రీన్ ఎల్ఈడి డిస్ ప్లే, టీవీ మందం 4.9mm
  • 4కే టెక్నాలజీ రిజల్యూషన్
  • 2జీబీ ర్యామ్, 8జీబీ ఇంటర్నల్ స్టోరేజీ
  • రెండు పోర్టులు USB 3.0, USB 2.0
  • వైఫై, బ్లూటూత్
  • డాల్బీ, డీటీఎస్ ఆడియో క్వాలిటీ
  • రెండు ఇన్ బిల్టెడ్ స్పీకర్లు (8 వాల్ట్స్)

More Telugu News