venkatesh: వెంకీ సరసన మరోసారి ఛాన్స్ కొట్టేసింది

  • త్వరలో సెట్స్ పైకి 'ఆటా నాదే వేటా నాదే'
  • వెంకీ సరసన కథానాయికగా శ్రియ 
  • కీలకమైన పాత్రలో నారా రోహిత్

తేజ .. వెంకటేశ్ కాంబినేషన్లో ఒక సినిమా రూపొందుతోంది. ఫ్యామిలీ థ్రిల్లర్ నేపథ్యంతో కూడిన ఈ సినిమా, త్వరలో రెగ్యులర్ షూటింగును మొదలెట్టనుంది. ఈ సినిమాకి 'ఆటా నాదే వేటా నాదే' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. దాదాపుగా ఇదే టైటిల్ ను ఖరారు చేయనున్నారు. ఈ సినిమాలో కథానాయికగా అదితీరావు హైదరీని అనుకున్నారు.

 కానీ పాత్ర పరంగా .. క్రేజ్ పరంగా చూస్తే శ్రియ కరెక్ట్ గా సరిపోతుందని భావించి ఆమెను తీసుకున్నట్టుగా సమాచారం. గతంలో వెంకటేశ్ .. శ్రియ కలిసి 'సుభాశ్ చంద్రబోస్' .. 'గోపాల గోపాల' సినిమాలు చేసి, చూడముచ్చటైన జంట అనిపించుకున్నారు. సురేశ్ బాబు .. అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాలో, నారా రోహిత్ ఒక కీలకమైన పాత్రను పోషించనుండటం విశేషం.   

More Telugu News