Ramcharan: 'రంగస్థలం' నుంచి తొలి పాట విడుదల

  • యేరు సెనగ కోసం మట్టిని తవ్వితే ఏకంగా తగిలిన లంకె బిందెలాగా అంటూ ప్రారంభమవుతోన్న పాట
  • దేవిశ్రీ ప్రసాద్ గానం
  • అలరిస్తోన్న పాట సాహిత్యం

రామ్ చ‌ర‌ణ్‌, స‌మంత జంట‌గా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకుంటోన్న 'రంగస్థలం' సినిమాలోని తొలి పాటను ఈ రోజు విడుద‌ల చేశారు. అంద‌మైన ప‌ల్లెటూరి కుర్రాడు త‌న మ‌న‌సుకు న‌చ్చిన అమ్మాయిని చూస్తూ పాడుకుంటున్న‌ట్లు ఉన్న ఈ పాట అంద‌రినీ అల‌రిస్తోంది. ఈ సినిమాలో స‌మంత‌ ‘రామలక్ష్మి’ పాత్ర‌లో క‌న‌ప‌డుతోన్న విష‌యం తెలిసిందే. ‘యేరు సెనగ కోసం మట్టిని తవ్వితే ఏకంగా తగిలిన లంకె బిందెలాగా ఎంత సక్కగున్నావే లచ్చిమి’ అంటూ ఈ పాట సాగుతోంది. ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించగా, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ దీనిని పాడారు. ఈ సినిమా మార్చి 30 విడుదల కానుంది.  

More Telugu News