India: దక్షిణాఫ్రికా విజయ లక్ష్యం 275!

  • రోహిత్ శర్మ 115, శిఖర్ ధావన్ 34, విరాట్ కోహ్లీ 36 పరుగులు
  • నాలుగు వికెట్లు తీసిన ఎన్గిడి 
  • బౌలింగ్‌లో రాణిస్తే సిరీస్ కైవసం చేసుకోనున్న భారత్

పోర్ట్ ఎలిజ‌బెత్ వేదిక‌గా జరుగుతోన్న భారత్, దక్షిణాఫ్రికా ఐదో వ‌న్డేలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి భారత్ 274 పరుగులు చేసింది. టీమిండియా బ్యాట్స్‌మెన్‌లో శిఖర్ ధావన్ 34, విరాట్ కోహ్లీ 36 (రనౌట్), అజింక్యా రహానె 8 (రనౌట్), రోహిత్ శర్మ 115, శ్రేయాస్ అయ్యర్ 30, హార్దిక్ పాండ్యా 0, మహేంద్ర సింగ్ ధోనీ 13, భువనేశ్వర్ కుమార్ 19 (నాటౌట్), కుల్దీప్ యాదవ్ 2 (నాటౌట్ ) పరుగులు చేశారు.

 దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎన్గిడి నాలుగు వికెట్లు తీయగా, రబడా ఒక్క వికెట్ పడగొట్టాడు. భారత్ బౌలింగ్‌లోనూ రాణించి ఈ వన్డే గెలిస్తే సిరీస్ కైవసం అవుతుంది. ఇప్పటికే భారత్ 3-1 తో ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే.      

More Telugu News