India: సెంచరీతో అదరగొట్టిన టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ

  • టీమిండియా ప్రస్తుత స్కోరు 203/3 (36 ఓవర్లకి)
  • శిఖర్ ధావన్ 34, విరాట్ కోహ్లీ 36 (రనౌట్), అజింక్యా రహానె 8 (రనౌట్)
  • క్రీజులో రోహిత్ శర్మ(101), అయ్యర్(12)

పోర్ట్ ఎలిజ‌బెత్ వేదిక‌గా జరుగుతోన్న భారత్, దక్షిణాఫ్రికా ఐదో వ‌న్డేలో టాస్ ఓడిన టీమిండియా బ్యాటింగ్ చేస్తోన్న విషయం తెలిసిందే. ఓపెనర్ శిఖర్ ధావన్ ధాటిగా బ్యాటింగ్ చేస్తున్నాడు. 107 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో సెంచరీ చేశాడు. కెరీర్‌లో రోహిత్‌ శర్మకి ఇది 17వ సెంచరీ. శిఖర్ ధావన్ 34, విరాట్ కోహ్లీ 36 (రనౌట్), అజింక్యా రహానె 8 (రనౌట్) వెనుదిరగగా రోహిత్ శర్మ మాత్రం క్రీజులో పాతుకుపోయాడు.

ప్రస్తుతం రోహిత్ శర్మ 101, శ్రేయాస్ అయ్యర్ 12 పరుగులతో ఉన్నారు. అదే సమయంలో టీమిండియా స్కోరు 203/3 (36 ఓవర్లకి) గా ఉంది. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబడాకి ఒక వికెట్ దక్కింది. 

More Telugu News