mahanati: 'మహానటి' సినిమాలో ఎన్టీఆర్, ఏఎన్నార్‌లను ఆ విధంగా చూపుతారట!

  • డిజిటల్ రూపంలో ఎన్టీఆర్, ఏఎన్నార్‌లను చూపనున్న సినీయూనిట్
  • 'మహానటి' వచ్చేనెల 29న విడుదల అయ్యే అవకాశం
  • కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో మహానటి

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్, ప్రియాంక దత్ సమర్పణలో మహానటి సావిత్రి బయోపిక్ రూపుదిద్దుకుంటోన్న విషయం తెలిసిందే. 'ఎవడే సుబ్రమణ్యం' ఫేం నాగ అశ్విన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను వచ్చేనెల 29న విడుదల చేయనున్నారు. సావిత్రి అనగానే అలనాటి దిగ్గజ నటులు ఎన్టీఆర్, ఏఎన్నార్‌లు కూడా గుర్తుకొస్తారు. ఆ నటులతో సావిత్రి కలిసి నటించిన సన్నివేశాలను డిజిటల్ రూపంలో ఈ సినిమాలో చూపనున్నారట. దీంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది.  

More Telugu News