Cricket: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా

  • పోర్ట్ ఎలిజ‌బెత్ వేదిక‌గా భారత్, దక్షిణాఫ్రికా ఐదో వ‌న్డే
  • 3-1తో ఆధిక్యంతో ఉన్న టీమిండియా
  • ఈ రోజు మ్యాచ్‌ గెలిస్తే సిరీస్ కైవసం

పోర్ట్ ఎలిజ‌బెత్ వేదిక‌గా కాసేపట్లో భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఐదో వ‌న్డే ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆరు వ‌న్డేల సిరీస్ లో ఇప్ప‌టివ‌ర‌కు జ‌రిగిన నాలుగు మ్యాచుల్లో టీమిండియా మూడింట్లో గెలిచి ఒక దాంట్లో ఓడిన విష‌యం తెలిసిందే. ఈ రోజు భారత్ మ్యాచ్ గెలిస్తే ఈ సిరీస్ ను కైవ‌సం చేసుకుంటుంది. ఈ రోజు జరిగే మ్యాచ్‌కి వరుణుడు అడ్డుతగులుతాడని భావించినప్పటికీ వాతావరణం అనుకూలంగా ఉండడంతో ఆటమొదలైంది. ఇప్పటికే మూడు మ్యాచులు ఓడి, ఒక మ్యాచ్ లో గెలిచిన ద‌క్షిణాఫ్రికా మిగిలి వున్న రెండు మ్యాచుల్లోనూ గెలిచి ప‌రువు నిల‌బెట్టుకోవాల‌ని చూస్తోంది.

More Telugu News