ram: మొత్తానికి రామ్ రంగంలోకి దిగుతున్నాడు!

  • త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రామ్  
  • కథానాయికగా అనుపమ పరమేశ్వరన్ 
  • మార్చి 16వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ 

తెలుగు యువ కథానాయకులలో రామ్ కి ప్రత్యేకమైన స్థానం వుంది. ఆయన బాడీ లాంగ్వేజ్ ను .. స్టైల్ ను యూత్ బాగా ఇష్టపడతారు. 'నేను శైలజ' సినిమా తరువాత ఆయన చేసిన రెండు సినిమాలు పరాజయం పాలయ్యాయి. దాంతో కొంత గ్యాప్ తీసుకున్న రామ్, తన తదుపరి సినిమాను త్రినాథరావు నక్కినతో ప్లాన్ చేసుకున్నాడు. 'సినిమా చూపిస్త మావ' .. 'నేను లోకల్' తరువాత త్రినాథరావు చేస్తోన్న సినిమా ఇది.

లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ కథ కొనసాగుతుందని అంటున్నారు. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాలో కథానాయికగా అనుపమ పరమేశ్వరన్ ను ఎంపిక చేసుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మార్చి16వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. రామ్ కి ఇది 16వ సినిమా .. 16వ తేదీనే ఈ సినిమాను మొదలెడుతుండటం విశేషం.    

More Telugu News