bsnl: ఫోన్ పే నుంచి రీచార్జ్ చేసుకుంటే బీఎస్ఎన్ఎల్ క్యాష్ బ్యాక్ ఆఫర్

  • రూ.250 వరకు రీచార్జ్ లపై రూ.50 క్యాష్ బ్యాక్
  • ఆపై విలువ కలిగిన రీచార్జ్ లపై రూ.75 క్యాష్ బ్యాక్
  • ఈ నెల 20 వరకు అమల్లో

బీఎస్ఎన్ఎల్ తన కస్టమర్లకు క్యాష్ బ్యాక్ ఆఫర్లను ప్రకటించింది. కాకపోతే ఫ్లిప్ కార్ట్ కు చెందిన ఫోన్ పే యాప్ ద్వారా రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా ఫోన్ పే నుంచి మొదటి సారి రీచార్జ్ చేసుకునే వారే క్యాష్ బ్యాక్ కు అర్హులు. గత నెల కస్టమర్లకు రీచార్జ్ లపై 50 శాతం అదనపు డేటాను ఆఫర్ చేసిన బీఎస్ఎన్ఎల్ తాజాగా ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ ను తీసుకొచ్చింది.

బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ కస్టమర్లు రూ.250 వరకు రీచార్జ్ లపై రూ.50 క్యాష్ బ్యాక్ పొందొచ్చు. రూ.250కు పైన విలువ కలిగిన రీచార్జ్ లపై రూ.75 క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ఈ ఆఫర్ ఫిబ్రవరి 20వ తేదీ వరకే అమల్లో ఉంటుంది. ఇలా పొందిన క్యాష్ బ్యాక్ ను ఫోన్ పే ప్లాట్ ఫామ్ పై రీచార్జ్ లకు, ఇతర చెల్లింపులకు వినియోగించుకోవచ్చు. జియో పోటీ కారణంగా కస్టమర్లను కాపాడుకోవడంతోపాటు కొత్త కస్టమర్లను పొందే విషయంలో బీఎస్ఎన్ఎల్ ఇతర కంపెనీల మాదిరిగానే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. 

More Telugu News