Telangana: ‘రెడ్డి శంఖారావం’లో నాయిని నర్సింహారెడ్డికి చేదు అనుభవం

  • హన్మకొండలో ‘రెడ్డి శంఖారావం’ బహిరంగ సభ
  • నాయిని ప్రసంగిస్తుండగా బాటిల్ విసిరిన గుర్తుతెలియని వ్యక్తి
  • మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు

వరంగల్ జిల్లా హన్మకొండలో జరుగుతున్న ‘రెడ్డి శంఖారావం’ బహిరంగ సభలో తెలంగాణ హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. స్థానిక ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఈరోజు మధ్యాహ్నం ఈ సభ ప్రారంభమైంది. ఈ సభలో నాయిని ప్రసంగిస్తుండగా గుర్తుతెలియని వ్యక్తి ఒకరు వేదిక వైపు ఓ బాటిల్ ని విసిరాడు. నాయినికి వ్యతిరేకంగా నినాదాలు చేశాడు. ఈ సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

More Telugu News