Telugudesam: రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం.. నష్టం కలిగించే ఏ అంశాన్ని సహించం : టీడీపీ నేత కళా వెంకట్రావు

  • తెలుగుదేశం ముఖ్యనేతలు, అందుబాటులో ఉన్న ఎంపీలతో చంద్రబాబు చర్చ
  • ప్రత్యేక ప్యాకేజ్ లో చెప్పినవన్నీ కేంద్ర ప్రభుత్వం నెరవేర్చాలి
  • రాష్ట్ర ప్రయోజనాలకు కావాల్సిన కేటాయింపులు కేంద్ర బడ్జెట్ లో లేవు: కళా వెంకట్రావు

రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని టీడీపీ నేత కళా వెంకట్రావు అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై తెలుగుదేశం ముఖ్యనేతలు, అందుబాటులో ఉన్న ఎంపీలతో సీఎం చంద్రబాబునాయుడు ఈరోజు నిర్వహించిన సమావేశంలో చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న కళా వెంకట్రావు మాట్లాడుతూ, రాష్టాన్ని అసంబద్ధంగా విడగొట్టారని, ప్రత్యేక ప్యాకేజ్ లో చెప్పినవన్నీ కేంద్ర ప్రభుత్వం నెరవేర్చాలని, రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని అన్నారు.

ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అని, రాష్ట్రానికి నష్టం కలిగించే ఏ అంశాన్నైనా సహించమని కళా వెంకట్రావు మరోమారు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కావాల్సిన కేటాయింపులు కేంద్ర బడ్జెట్ లో లేవని, ఈ కేటాయింపుల్లో రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాలేదని, కేవలం స్వార్థ ప్రయోజనాల కోసమే ప్రధాన ప్రతిపక్షం ఉన్నట్టుందని ఈ సందర్భంగా ఆయన విమర్శించారు.

More Telugu News