Mahesh Babu: 600 మంది దివ్యాంగులకు భోజనం పెట్టించిన మహేశ్ బాబు దంపతులు

  • ఈ రోజు మహేశ్ బాబు, నమ్రత పెళ్లిరోజు
  • 2005లో ఇదే రోజున ప్రేమ వివాహం చేసుకున్న మహేశ్ 
  • సోషల్ మీడియాలో వారి పెళ్లి ఫొటోలు వైరల్

టాలీవుడ్ అగ్రహీరోల్లో ఒకరిగా వెలుగొందుతోన్న మహేశ్‌బాబు తన పెళ్లిరోజు సందర్భంగా, ఈ రోజు తన భార్య నమత్రతో కలిసి హైదరాబాదు, దేవ్నార్‌ పాఠశాలలోని 600 మంది దివ్యాంగులకు భోజనాలు ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోల‌ను ఆయ‌న అభిమానులు సోష‌ల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు.

మ‌హేశ్ బాబు, న‌మ్ర‌త‌ల పెళ్లి ఫొటోలను కూడా పెద్ద ఎత్తున పోస్ట్ చేస్తున్నారు. మహేశ్ బాబు, నమత్ర 2005లో ఇదే రోజున ప్రేమ వివాహం చేసుకున్నారు. సినిమాల్లో, యాడ్స్ లో నటిస్తూ ఎప్పుడూ బిజీగా ఉండే మహేశ్ బాబు వీలు దొరికినప్పుడల్లా తన కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తారు.  

More Telugu News