helmet: బైక్‌పై వెళుతూ 20 అడుగుల లోతులో పడ్డ యువకుడు.. ప్రాణాపాయం నుంచి కాపాడిన హెల్మెట్‌!

  • హైదరాబాద్‌లోని సచివాలయం ఎదుట ఘటన
  • భూగర్భ పైప్‌లైన్‌ కోసం తీసిన గొయ్యి 
  • యువకుడిని కాపాడిన స్థానికులు
  • అధికారులు గోతిని మూసేయట్లేదని ఆగ్రహం

బైక్‌పై వెళుతోన్న ఓ యువకుడు భూగర్భ పైప్‌లైన్‌ కోసం తీసిన పెద్ద గోతిలో పడిపోయిన ఘటన హైదరాబాద్‌లోని సచివాలయం ఎదుట ఈ రోజు ఉదయం చోటు చేసుకుంది. సుమారు 20 అడుగుల లోతున ఆ గొయ్యి ఉండడంతో ఆ యువకుడు తీవ్ర గాయాలపాలై ఉండొచ్చని అనుకున్నారు. ఇంతలో లోపలి నుంచి ఆ యువకుడు కేకలు వేశాడు.

దీంతో, ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు ఆ యువకుడిని బయటకు తీశారు. ఆ యువకుడు హెల్మెట్‌ ధరించి ఉండడంతో ప్రాణాపాయం తప్పింది. ఆ గుంతను తవ్వి దాన్ని అలాగే వదిలిపెట్టారని, అందుకే ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు మండిపడ్డారు.  

More Telugu News