maniratnam: దర్శకుడు మణిరత్నం కొత్త చిత్రం 'నవాబ్'!

  • ప్రధాన పాత్రల్లో అరవింద్ స్వామి, సిలంబరసన్, అరుణ్ విజయ్, విజయ్ సేతుపతి
  •  సంగీతం ఏఆర్ రెహ్మాన్   
  • ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన మణిరత్నం

దర్శకుడు మణిరత్నం తన తదుపరి తమిళ, తెలుగు చిత్రాన్ని ఈరోజు ప్రకటించారు. తమిళంలో దీని పేరు ‘చెక్కా చివంత వానం’ కాగా, తెలుగులో 'నవాబ్'. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో నలుగురు నటులు అరవింద్ స్వామి, సిలంబరసన్, అరుణ్ విజయ్, విజయ్ సేతుపతి ఉన్నారు. మణిరత్నం సొంత సంస్థ అయిన మద్రాసు టాకీస్ బ్యానర్ పై ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

ఈ చిత్రంలో జ్యోతిక, జయసుధ, ప్రకాష్ రాజ్, త్యాగరాజన్, అదితిరావ్ హైదరి, మోడల్ దయానా ఎర్రప్ప, మన్సూర్ అలీ ఖాన్ నటిస్తున్నారు. ద్విభాషా చిత్రంగా రూపొందుతున్న దీనికి షరా మామూలుగా ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.   

More Telugu News