sundeep kishan: పవన్ కల్యాణ్ కోసం ఓ కథ రెడీ చేశాను .. 'పవన్' అనే టైటిల్ కూడా పెట్టేశాను: మహేశ్ సోదరి మంజుల

  • మహేశ్ తరువాత పవన్ అంటే అభిమానం 
  • ఆయనలోని నిజాయతీ నచ్చుతుంది 
  • నేను రెడీ చేసిన కథ వినమని చెప్పండి

మహేశ్ సోదరి మంజుల దర్శకత్వంలో 'మనసుకు నచ్చింది' సినిమా రూపొందింది. సందీప్ కిషన్ - అమైరా దస్తూర్ జంటగా ఈ సినిమా ఈ నెల 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మంజుల మాట్లాడుతూ .. ఈ సినిమా విశేషాలను పంచుకున్నారు.

ఈ సమయంలోనే ఆమె పవన్ కల్యాణ్ గురించి ప్రస్తావించారు. "మా నాన్నగారు .. మహేశ్ తరువాత నేను ఎక్కువగా అభిమానించే వ్యక్తి పవన్ కల్యాణ్. ఆయనలోని నిజాయతీ నాకు బాగా నచ్చుతుంది. ఆయన కోసం నేను ఒక కథ రాసుకున్నాను .. ఆ కథకి 'పవన్' అనే టైటిల్ ను కూడా పెట్టేశాను. నేను రాసిన కథ పవన్ వినాలే గానీ, ఆయనకి తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం వుంది. ఒకసారి ఈ కథ వినమని మీరైనా చెప్పండి" అంటూ ఆమె మీడియా మిత్రులను కోరడం విశేషం.      

More Telugu News