Revanth Reddy: అందుకే, బడ్జెట్‌పై మోదీని కేసీఆర్ ప్ర‌శ్నించ‌డం లేదు: రేవంత్ రెడ్డి

  • కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండ‌లంలో కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ప‌ర్య‌ట‌న‌
  • కేంద్ర బ‌డ్జెట్ లో తెలంగాణ‌కు అన్యాయం జ‌రిగింది
  • కేసీఆర్ ఎందుకు నోరు విప్ప‌డం లేదు?
  • కేసుల‌కు భ‌య‌ప‌డే-రేవంత్ రెడ్డి

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండ‌లంలో కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఈ రోజు ప‌ర్య‌టిస్తున్నారు. ఆ మండ‌లంలోని అడ‌వి లింగాల‌లో ద‌ర్గాను ద‌ర్శించుకున్న రేవంత్ రెడ్డి అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ... వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ గెలుపు త‌థ్యమ‌ని అన్నారు. తాము విసురుతోన్న స‌వాల్ ను టీఆర్ఎస్ స్వీక‌రించ‌గ‌ల‌దా? అని ప్ర‌శ్నించారు.

కాగా, ఇటీవ‌ల పార్ల‌మెంటులో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్‌లో తెలంగాణ‌కు అన్యాయం జ‌రిగింద‌ని, అయిన‌ప్ప‌టికీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఎందుకు నోరు విప్ప‌డం లేదని ఆయ‌న ప్ర‌శ్నించారు. త‌న మీద ఉన్న‌ కేసుల‌కు భ‌య‌ప‌డే కేసీఆర్.. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీని ప్ర‌శ్నించ‌లేక‌పోతున్నార‌ని ఆరోపించారు.     

More Telugu News