student: చిన్నారి చెంప ఛెళ్లుమనిపించిన ఉపాధ్యాయురాలు.. ప్రాణాలు కోల్పోయిన విద్యార్థిని

  • ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని బ‌ల్లియా ప్రాంతంలో ఘటన
  • తరగతి గదిలో సృహ తప్పి పడిపోయిన విద్యార్థిని (11)
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని బ‌ల్లియా ప్రాంతంలోని ఓ ప్రైవేటు స్కూల్‌లో ర‌జ‌నీ ఉపాధ్యాయ్ అనే టీచ‌ర్ ఓ చిన్నారి చెంప‌ఛెళ్లుమ‌నిపించ‌డంతో ఆ విద్యార్థిని అక్క‌డే సృహ త‌ప్పి ప‌డిపోయింది. అనంత‌రం ఆమెను ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అయితే, ఆ చిన్నారి ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.

ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు స‌దరు ఉపాధ్యాయినిని అరెస్టు చేశారు. ఆ చిన్నారిని ఆ టీచ‌ర్ చెంప‌పై బ‌లంగా కొట్ట‌డంతోనే చ‌నిపోయిన‌ట్లు భావిస్తున్నారు. ఈ విద్యార్థిని (11) ఐదో త‌ర‌గ‌తి చ‌దువుతోంద‌ని పోలీసులు చెప్పారు. ఈ ఘ‌ట‌న‌తో ఆ విద్యార్థిని మృత‌దేహంతో పాఠ‌శాల ఎదుట ఆమె త‌ల్లిదండ్రులు, బంధువులు ఆందోళ‌న చేప‌ట్టారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.  

More Telugu News