Prime Minister: మూడుదేశాల పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోదీ

  • ఢిల్లీ నుంచి జోర్డన్ బయల్దేరిన ప్రధాని మోదీ
  • పాలస్తీనాలో పర్యటిస్తున్న తొలి భారత ప్రధాని మోదీ 
  • ఆరు నెలల క్రితం పాలస్తీనా బద్ధశత్రువు ఇజ్రాయెల్ లో పర్యటించిన మోదీ

భారత ప్రధాని నరేంద్ర మోదీ పాలస్తీనా, యూఏఈ, ఒమన్ దేశాల పర్యటనకు బయల్దేరారు. పాలస్తీనా బయల్దేరిన ప్రధాని ఆ దేశ బద్ధశత్రువైన ఇజ్రాయెల్ పర్యటనలకు ఆరు నెలల క్రితం వెళ్లిన సంగతి తెలిసిందే. కాగా, పాలస్తీనా వెళ్తున్న తొలి భారత ప్రధాని మోదీ కావడం విశేషం.

పాలస్తీనా నుంచి మోదీ యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ వెళ్లనున్నారు ఆ పర్యటన ముగిసిన అనంతరం ఆయన ఒమన్‌ లో పర్యటించనున్నారు. సోమవారం నాటికి ప్రధాని పర్యటన ముగియనుంది. ఢిల్లీ నుంచి బయల్దేరిన ప్రధాని జోర్డాన్‌ రాజధాని అమ్మాన్‌ చేరుకోనున్నారు. 

More Telugu News