sai dharam tej: నాతో సినిమా చేయడమే వినాయక్ గొప్పతనం: సాయిధరమ్ తేజ్

  • వినాయక్ పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చారు 
  • ఆయనతో కలిసి పనిచేయడం అదృష్టం
  • సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పాత్రలో కనిపిస్తాను  

సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా వినాయక్ దర్శకత్వంలో రూపొందిన 'ఇంటిలిజెంట్' సినిమా, ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ .. "అవసరానికి ఆదుకున్నవారు కష్టాల్లో వున్నపుడు .. వాళ్లని కాపాడటం కోసం ఎంతదూరమైనా వెళ్లే ఓ యువకుడి కథ ఇది. తన వాళ్ల కోసం ఉద్యోగాన్ని సైతం వదిలేసి శత్రువులతో తలపడతాడు. ఈ సినిమాలో నేను సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా కనిపిస్తాను"

"వినాయక్ గారు ఈ పాత్రను అద్భుతంగా మలిచారు. చిరంజీవి గారితో 'ఖైదీ నెంబర్ 150' చేసి హిట్ కొట్టిన ఆయన, తదుపరి సినిమా కోసం .. వరుస ప్లాపులతో వున్న నన్ను ఎంచుకోవడం ఆయన గొప్పతనం. పిలిచి మరీ ఈ సినిమాలో ఆయన ఛాన్స్ ఇవ్వడం నా అదృష్టం. ఆయనతో కలిసి పనిచేయడం ఎప్పటికీ మరిచిపోలేని ఒక మధురమైన అనుభూతి. నా సినిమాల నుంచి అభిమానులు ఆశించే అన్ని రకాల అంశాలు ఇందులో ఉంటాయి. పైరసీని ప్రోత్సహించకుండా ఈ సినిమాను థియేటర్స్ కి వెళ్లి చూడండి " అని చెప్పుకొచ్చాడు.   

More Telugu News