Virat Kohli: కేప్‌టౌన్ వన్డేలో భారత్ రికార్డుల మోత!

  • మూడో వన్డేలో భారత్ ఘన విజయం
  • పలు రికార్డులను సొంతం చేసుకున్న టీమిండియా
  • కోహ్లీ ఖాతాలో మరికొన్ని రికార్డులు

దక్షిణాఫ్రికాతో బుధవారం కేప్‌టౌన్ వన్డేలో భారత్ ఘన విజయం సాధించడంతోపాటు పలు రికార్డులను సృష్టించింది. ఈ మ్యాచ్‌ లో సఫారీలను 124 పరుగుల తేడాతో ఓడించిన భారత్, వరుసగా మూడు వన్డేలను గెలుచుకుని 3-0 ఆధిక్యం సాధించింది. సిరీస్ గెలుపు కోసం భారత్ మరో విజయం సాధిస్తే సరిపోతుంది. ఇక ఈ మ్యాచ్‌లో భారత్ సొంతమైన రికార్డులు ఇవీ..

* ఓ ద్వైపాక్షిక సిరీస్‌లో దక్షిణాఫ్రికా 0-3తో వెనుకబడడం ఇదే తొలిసారి
* దక్షిణాఫ్రికాలో దక్షిణాఫ్రికాపై భారత్ అత్యధిక పరుగుల తేడాతో విజయం సాధించడం ఇదే ప్రథమం

* మూడు వన్డేల్లోనూ కలిపి భారత స్పిన్నర్లు 21 వికెట్లు తీసుకున్నారు. దక్షిణాఫ్రికాతో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లో ఆ దేశ గడ్డపై ఇన్ని వికెట్లు తీసుకోవడం కూడా ఇదే మొదటిసారి

* ఈ మ్యాచ్‌లో టీమిండియా సారథి విరాట్ కోహ్లీ అజేయంగా 160 పరుగులు చేశాడు. 1983లో టర్న్‌బ్రిడ్జ్ వెల్స్‌లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో కపిల్ దేవ్ అజేయంగా 175 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఓ భారత కెప్టెన్ విదేశాల్లో సాధించిన అత్యధిక వ్యక్తిగత పరుగులు ఇవే.

* 12.10 సగటుతో రోహిత్ శర్మ అత్యంత చెత్త గణాంకాలు నమోదు చేశాడు. దక్షిణాఫ్రికాలో భారత బ్యాట్స్‌మన్ అత్యంత చెత్త సగటు ఇదే.

* ఈ వన్డేల్లో సెంచరీ కోసం కోహ్లీ 119 బంతులు ఆడాడు. సెంచరీ కోసం ఇన్ని బంతులు ఆడడం కోహ్లీకి ఇదే తొలిసారి

* కెప్టెన్‌గా కోహ్లీ 12 సెంచరీలు సాధించి మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పేరుపై ఉన్న రికార్డును తుడిచేశాడు. గంగూలీ 142 ఇన్నింగ్స్‌లలో 11 సెంచరీలు చేయగా గంగూలీ 43 ఇన్నింగ్స్‌లలోనే 12 సెంచరీలు బాదాడు.

More Telugu News