vijay devarakonda: విజయ్ దేవరకొండకి భారీ మొత్తంలో అడ్వాన్స్ ఇచ్చిన నిర్మాతలు!

  • విజయ్ దేవరకొండ చేతిలో అరడజను సినిమాలు 
  • మైత్రీ మూవీ మేకర్స్ నుంచి భారీ ఆఫర్ 
  • కథానాయికగా రష్మిక మందనకు ఛాన్స్ 

'అర్జున్ రెడ్డి' సినిమాతో విజయ్ దేవరకొండ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ప్రస్తుతం ఆయన చేతిలో అరడజను వరకూ సినిమాలు వున్నాయి. ఆ సినిమాలను పూర్తి చేసే పనిలో ఆయన బిజీగా వున్నాడు. ఈ నేపథ్యంలో ఆయనతో సినిమాలు చేయడానికి ఇతర దర్శక నిర్మాతలు ఆసక్తిని చూపుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ కూడా విజయ్ దేవరకొండతో జూన్ తరువాత ఓ సినిమాను చేయడానికి రెడీ అవుతోంది.

 ఇందుకోసం విజయ్ దేవరకొండకి రెండున్నర కోట్లను అడ్వాన్స్ గా కూడా ఇచ్చినట్టు సమాచారం. ఈ సినిమాలో విజయ్ దేవరకొండకి జోడీగా రష్మిక మందనను తీసుకున్నట్టు చెబుతున్నారు. ఆల్రెడీ విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ చేస్తోన్న సినిమాలో కథానాయికగా రష్మిక చేస్తోంది. అదే జోడీతో మైత్రీ మూవీ మేకర్స్ వారు సినిమాను ప్లాన్ చేస్తుండటం విశేషం. ఈ సినిమాతో కొత్త దర్శకుడు పరిచయమవుతాడని అంటున్నారు.        

More Telugu News