nithin: నితిన్ కి త్రివిక్రమ్ అందించిన కథపైనే అందరి దృష్టి!

  • నితిన్ .. మేఘా ఆకాశ్ జంటగా సినిమా 
  • కథను అందించిన త్రివిక్రమ్ 
  • ఏప్రిల్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు 

నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి .. పవన్ కల్యాణ్ .. త్రివిక్రమ్ కలిసి కృష్ణచైతన్య దర్శకత్వంలో ఒక సినిమాను నిర్మిస్తున్నారు. నితిన్ కథానాయకుడిగా .. మేఘా ఆకాశ్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాకి 'గుర్తుందా శీతాకాలం' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమాకి త్రివిక్రమ్ ఒక నిర్మాత మాత్రమే కాదు .. కథను అందించింది కూడా ఆయనే.

'అజ్ఞాతవాసి' కథ విషయంలో త్రివిక్రమ్ సరిగ్గా దృష్టిపెట్టలేదనే విమర్శలు వచ్చాయి. ఈ కారణంగా నితిన్ సినిమాకి ఆయన అందించిన కథా నేపథ్యం గురించే అందరిలో ఆసక్తి రేకెత్తుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి త్రివిక్రమ్ అందించిన కథ రొమాంటిక్ డ్రామాగా కొనసాగుతుందనేది తాజా సమాచారం. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకునేలా ఈ కథ ఉంటుందని చెబుతున్నారు. ఈ నెల 12 న టైటిల్ ను ఖరారు చేసి .. 14న టీజర్ ను రిలీజ్ చేసి .. ఏప్రిల్ 5వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.  

More Telugu News