mohan babu: 'గాయత్రి'లో 'శారద'గా శ్రియ అదరగొట్టేస్తుందట!

  • మదన్ దర్శకత్వంలో 'గాయత్రి'
  • ద్విపాత్రాభినయంతో మోహన్ బాబు
  • ఈ నెల 9వ తేదీన భారీస్థాయిలో రిలీజ్  

నిన్నటితరం అందాల కథానాయికగా తెలుగు .. తమిళ భాషల్లో శ్రియకి ప్రత్యేకమైన గుర్తింపు వుంది. ఈ మధ్య కాలంలో ఆమె తన వయసుకి తగిన కీలకమైన పాత్రలను చేస్తూ వస్తోంది. అలా ఆమె 'గాయత్రి' సినిమాలో చేసింది. మోహన్ బాబు ఈ సినిమాను నిర్మిస్తూ ఆయన ద్విపాత్రాభినయం చేశారు. ఈ సినిమాలో 'గాయత్రి'గా నిఖిలా విమల్ నటించగా, మరో ముఖ్యమైన పాత్రను శ్రియ చేసింది.

 ఈ సినిమాకి సంబంధించి శ్రియ పోస్టర్స్ చూసినవాళ్లు .. ఆమె ఇంతకుముందు కన్నా చాలా గ్లామరస్ గా ఉందని అంటున్నారు. ఈ సినిమాలో ఆమె ఏ పాత్ర పోషించి వుంటుందనే ఆసక్తితో వాళ్లు వున్నారు. ఈ సినిమాలో ఆమె మంచు విష్ణు భార్య 'శారద' పాత్రలో కనిపిస్తుందట. ఈ పాత్రను దర్శకుడు మదన్ అద్భుతంగా తీర్చిదిద్దాడని అంటున్నారు. శారద పాత్రలో శ్రియ అదరగొట్టేసిందనేది యూనిట్ సభ్యుల మాట. ఈ నెల 9వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. 

More Telugu News