manchu vishnu: 70 కోట్ల ఖర్చుతో 'భక్త కన్నప్ప'.. హీరోగా మంచు విష్ణు

  • కొత్తగా మళ్లీ తెరపైకి 'భక్త కన్నప్ప'
  • నిర్మాతగా .. కథానాయకుడిగా మంచు విష్ణు 
  • త్వరలో పూర్తి వివరాలతో వెలువడనున్న ప్రకటన

కృష్ణంరాజు కెరియర్లో చెప్పుకోదగిన సినిమాల్లో 'భక్త కన్నప్ప' ఒకటి. ఆయన సొంత బ్యానర్లో .. బాపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా, అప్పట్లో ఘనవిజయాన్ని సాధించింది. సత్యం అందించిన సంగీతం ఈ సినిమాను మ్యూజికల్ హిట్ గా నిలిపింది. అదే 'భక్త కన్నప్ప' కథను ఈనాటి సాంకేతిక నైపుణ్యంతో రూపొందించనున్నట్టు కొంతకాలం క్రితం మంచు విష్ణు చెప్పాడు. ఆయన కథానాయకుడిగా నటించనున్న ఈ సినిమాకు .. కథను తనికెళ్ల భరణి అందించారు.

 ఆ తరువాత ఎక్కడా ఈ ప్రస్తావన లేకపోవడంతో ఈ ప్రాజెక్టు ఆగిపోయిందని అంతా అనుకున్నారు. కానీ ఈ సినిమాకి సాయిమాధవ్ బుర్రా సంభాషణలు అందిస్తున్నాడని తాజాగా విష్ణు చెప్పాడు. దాదాపు 70 కోట్ల ఖర్చుతో ఈ సినిమాను నిర్మించనున్నామని అన్నాడు. హాలీవుడ్ టెక్నీషియన్స్ ఈ సినిమా కోసం పనిచేస్తారనీ, దర్శకుడు ఎవరనే విషయంతో పాటు మిగతా వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని చెప్పాడు.  

More Telugu News