mla raja singh: వందేమాతరం అనాల్సిందే... లేదంటే దేశం నుంచి వెళ్లిపోవాలి: ఎమ్మెల్యే రాజా సింగ్ లోధా

  • ప్రతి ఒక్కరూ ఆర్ఎస్ఎస్ లో చేరాలి
  • లేదంటే జాతికి సేవ చేయలేరు
  • వందేమాతరం, భారత్ మాతాకీ జై అని అందరూ అనాల్సిందే
  • లేదంటే దేశం విడిచి వెళ్లిపోవాలి

గోషామహల్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే టి.రాజాసింగ్ లోధా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన ఉద్దేశ్యంలో ఆర్ఎస్ఎస్ సమావేశాలకు హాజరు కాని వారు అసలు హిందువులే కాదన్నారు. ‘‘ఆర్ఎస్ఎస్ ఒక ఫ్యాక్టరీ. ప్రధాని నరేంద్రమోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తదితర మార్గదర్శకులను తయారు చేసింది’’ అని రాజాసింగ్ అన్నారు. ఆదివారం మద్యప్రదేశ్ లోని నీముచ్ జిల్లాలో జరిగిన ఓ భారీ బహిరంగ సభలో పాల్గొన్న సందర్భంగా ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ‘‘మీ అందరికీ నా అభ్యర్థన ఏమంటే సమీపంలోని ఆర్ఎస్ఎస్ శాఖలో మీ పేర్లు నమోదు చేసుకోండి. హిందువులు ఎవరైనా ఆర్ఎస్ఎస్ లో చేరలేదంటే వారు నిజమైన హిందువులే కాదు. జాతికి వారు సేవ చేయలేరు’’ అంటూ రాజా సింగ్ అన్నారు.

‘‘భారత్ లో నివసించే వారు ఎవరైనా కానీ మతాలకు అతీతంగా భారత్ మాతాకీ జై, వందేమాతరం అనాల్సిందే. లేదంటే వారు ఈ దేశాన్ని విడిచి పెట్టి వెళ్లిపోవాలి. శుత్రుదేశాన్ని, ఉగ్రవాదులను పొగిడే ప్రజలను ప్రపంచంంలో ఏ దేశం కూడా భరించదు. ఏ ఇతర దేశంలోనూ భారత్ మాతాకీ జై అంటే ఉపేక్షించరు. కానీ మన దేశంలో పాకిస్థాన్ జిందాబాద్ అనేవారు, అఫ్జల్ గురు వంటి ఉగ్రవాదులను కొనియాడే ప్రజలు ఉన్నారు’’ అని రాజాసింగ్ అన్నారు. లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా, మతమార్పిడులకు పాల్పడుతున్న క్రిస్టియన్ మిషనరీలకు వ్యతిరేకంగా పోరాడాలని హిందువులకు ఆయన పిలుపునిచ్చారు.

More Telugu News