suicide: స్మార్ట్‌ఫోన్ కొనివ్వ‌లేద‌ని బావిలో దూకి ఆత్మహత్య!

  • మహబూబాబాద్ కేసముద్రం మండలం దన్నసరి గ్రామశివారులో ఘటన
  • ఇంటర్మీడియట్ చదువుతోన్న బానోత్ మోహన్ (16) 
  • దర్యాప్తు చేస్తోన్న పోలీసులు

స్మార్ట్‌ఫోన్ కొనివ్వ‌డం లేద‌న్న చిన్న కార‌ణంతో అలిగిన ఓ బాలుడు బావిలో దూకి ఆత్మహ‌త్య చేసుకున్న ఘ‌ట‌న మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం దన్నసరి గ్రామశివారులోని సబ్‌స్టేషన్ తండాలో చోటు చేసుకుంది. సెల్‌ఫోన్ కొనివ్వ‌క‌పోతే ఇంత‌టి క‌ఠిన నిర్ణ‌యం తీసుకుంటాడ‌ని తాము అనుకోలేద‌ని ఆ బాలుడి తల్లిదండ్రులు ఆవేద‌న చెందారు. ఈ ఘటనపై స‌మాచారం అందుకున్న‌ పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లికి చేరుకుని వివ‌రాలు తీసుకున్నారు.

ఈ ఘ‌ట‌న‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆ బాలుడి పేరు బానోత్ మోహన్ (16) అని, అత‌డు స్థానిక క‌ళాశాల‌లో ఇంటర్మీడియట్ చదువుతున్నాడని తెలిపారు. త‌న‌కు సెల్‌ఫోన్ కావాల‌ని కొన్ని రోజులుగా త‌న త‌ల్లిదండ్రుల‌ను కోరుతున్నాడ‌ని తెలిపారు.   

More Telugu News