rescue: రైలు కింద పడిపోతోన్న బాలుడి ప్రాణాలు కాపాడిన ఆర్పీఎఫ్ పోలీసు.. సీసీ కెమెరాలో రికార్డు

  • మ‌హారాష్ట్ర‌లోని నైగాన్ రైల్వే స్టేష‌న్‌లో ఘటన
  • తల్లితో కలిసి రైల్వే స్టేషన్‌కి వచ్చిన బాలుడు
  • ప్లాట్ ఫామ్‌కి, రైల్వే ట్రాక్ కి మ‌ధ్య‌లో ఇరుక్కుపోయిన వైనం

రైలు కింద పడిపోతోన్న ఏడేళ్ల‌ బాలుడిని గ‌మ‌నించిన రైల్వే ప్రొటెక్ష‌న్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) పోలీసు వెంట‌నే స్పందించి, అతడిని కాపాడిన ఘ‌ట‌న మ‌హారాష్ట్ర‌లోని నైగాన్ రైల్వే స్టేష‌న్‌లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్క‌డి సీసీటీవీ కెమెరాలో రికార్డ‌య్యాయి. ఆ బాలుడు తన తల్లితో కలిసి రైల్వే స్టేషన్‌కు వచ్చాడు. తల్లి రైలు ఎక్కేయగా, ఆ బాలుడు రైలు ఎక్కబోయి ప్లాట్ ఫామ్‌కి రైల్వే ట్రాక్ కి మ‌ధ్య‌లో పడిపోయాడు. అంతలోనే రైలు కదిలింది.
 
ఈ విష‌యాన్ని గుర్తించిన ఆర్పీఎఫ్ పోలీసు సునీల్ నాపా ఆ బాలుడిని చాలా జాగ్ర‌త్త‌గా పైకి లాగి అత‌డి ప్రాణాలు కాపాడాడు. ఆ బాలుడు త‌న త‌ల్లితో క‌లిసి రైల్వే స్టేష‌న్ లో మెట్లు దిగుతూ వ‌చ్చిన విజువ‌ల్స్ కూడా సీసీ కెమెరాలో రికార్డ‌య్యాయి. వారి పేర్ల‌ను రైల్వే అధికారులు వెల్ల‌డించ‌లేదు.  

More Telugu News