Kajal Agarwal: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • యువ హీరో సరసన నాయికగా కాజల్
  • గోపీచంద్ సినిమాకు టైటిల్ ఖరారు 
  • 'సాహో'కు నాలుగు నెలల వీఎఫ్ఎక్స్ పనులు 
  • ఆ సినిమాలో ఒకేఒక్క పాత్ర వుంటుంది!  

*  అందాలతార కాజల్ అగర్వాల్ త్వరలో యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన నాయికగా నటించనుంది. నూతన దర్శకుడు నాని దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ నటించే చిత్రం కోసం కాజల్ ను తీసుకుంటున్నారట.
*  యాక్షన్ హీరో గోపీచంద్ నటిస్తున్న 25వ చిత్రానికి 'పంతం' అనే టైటిల్ని నిర్ణయించారు. నూతన దర్శకుడు కె.చక్రవర్తి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మే 18న విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించారు. ఇందులో మెహరీన్ కథానాయికగా నటిస్తోంది.
*  ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'సాహో'కు సంబంధించిన భారీ యాక్షన్ ఎపిసోడ్ ను త్వరలో యూఏఈలో చిత్రీకరించనున్నారు. ఇక ఈ చిత్రంలోని వీఎఫ్ఎక్స్ పనుల కోసం సుమారు నాలుగు నెలల సమయం పడుతుందని, అందుకని చిత్రం విడుదల 2019 సంక్రాంతికి ఉంటుందని అంటున్నారు. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రద్ధా కపూర్ నాయికగా నటిస్తోంది.
*  ఒకేఒక్క పాత్రతో తెలుగులో ఓ ప్రయోగాత్మక చిత్రం రూపొందనుంది. గతంలో పలు చిత్రాలలో నటించిన ఆదిత్య ఓం నటించే చిత్రంలో ఈ తమాషా చోటు చేసుకోనుంది. నూతన దర్శకుడు రాఘవ తిరువాయిపాటి దర్శకత్వం వహించే ఈ చిత్రంలో ఆదిత్య ఓం ఒక్కడే కనిపిస్తాడట. మరో పాత్ర వుండదట!        

More Telugu News