Niveda Thomas: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • రవితేజ సినిమాలో మలయాళ బ్యూటీ 
  • స్పెషల్ జర్నీ అంటున్న సమంత 
  • శర్వానంద్ సరసన 'హలో' నాయిక 
  • ఇందిర పాత్రలో నదియా?

*  రవితేజ సరసన మలయాళ బ్యూటీ నివేద థామస్ నాయికగా నటించనుంది. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందే 'అమర్ అక్బర్ ఆంథోని' చిత్రంలో రవితేజ మూడు పాత్రలు పోషించనున్నాడు. ఈ చిత్రం కోసం ఇప్పటికే కాజల్ ను ఓ నాయికగా ఎంపిక చేయగా, మరో నాయికగా నివేదను తాజాగా తీసుకున్నారు. మరో హీరోయిన్ ఎంపిక జరగాల్సి వుంది.
*  'రంగస్థలం' చిత్రంలో తన షూటింగ్ పార్ట్ పూర్తయిందని చెప్పింది కథానాయిక సమంత. స్పెషల్ టీంతో ఇది తనకు స్పెషల్ జర్నీ లాంటిదని ఆమె ట్వీట్ చేసింది. సుకుమార్ దర్శకత్వంలో చరణ్, సమంత జంటగా ఈ చిత్రం రూపొందుతున్న సంగతి విదితమే.
*  వరుస విజయాలతో వెళుతున్న యంగ్ హీరో శర్వానంద్ త్వరలో సుధీర్ వర్మ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు. ఇందులో నటించే ఇద్దరు హీరోయిన్లలో ఒకరిగా 'హలో' ఫేం కల్యాణి నటించనుంది.      
*  తేజ దర్శకత్వంలో బాలకృష్ణ నటించే 'ఎన్టీఆర్' బయోపిక్ లో కీలక పాత్రలో ప్రముఖ నటి నదియా నటించనున్నట్టు తెలుస్తోంది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్రను నదియా పోషిస్తుందట.  

More Telugu News