Padmaavat: 'ఘూమర్' పాటకు ఐస్ పై స్కేటింగ్ డాన్స్ చేసిన రాజస్థానీ యువతి... యూట్యూబ్ లో వైరల్!

  • ‘పద్మావత్‌’ సినిమాపై రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ లలో నిషేధం
  • ఘూమర్ పాటకు డాన్స్ చేసిన రాజస్థానీ ఇండియన్ అమెరికన్
  • ఐస్ స్కేటింగ్ చేస్తూ ఆకట్టుకున్న మయూరీ భండారీ

బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణె టైటిల్‌ రోల్‌ పోషించిన ‘పద్మావత్‌’ సినిమా రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ లలో పెనుకలకలం రేపిన సంగతి తెలిసిందే. రాజ్ పుత్ కర్ణి సేన ఈ సినిమాను ప్రదర్శించిన థియేటర్లపై దాడులు కూడా చేసింది. అంతేకాక ఈ సినిమాలో బహుళ ప్రజాదరణ పొందిన ‘ఘూమర్..’ పాటపై నిషేధం కూడా విధించారు. ఈ పాటకు డాన్స్ చేయకూడదనే నిబంధన కూడా విధించిన సంగతి తెలిసిందే.

అయితే మయూరీ బండారీ అనే ఇండియన్ అమెరికన్ యువతి ఒకరు ఐస్ పై స్కేటింగ్ చేస్తూ, ఈ పాటకు డాన్స్ చేసింది. తన యూట్యూబ్ అకౌంట్ లో పోస్టు చేయగా, అది ఆకట్టుకుంటోంది. రాజస్థానీ యువతిగా ఈ పాటకు డ్యాన్స్‌ చేయడం గౌరవంగా భావించినట్లు తెలిపిన మయూరీ, ‘పద్మావత్‌’ చిత్ర బృందానికి ఈ పాటను అంకితం ఇస్తున్నట్లు తెలిపారు. దానిని మీరు కూడా చూడండి.  

More Telugu News