nikhil: 'కిరాక్ పార్టీ ' రిలీజ్ పై పట్టుపడుతున్న నిఖిల్!

  • నిఖిల్ తాజా చిత్రంగా 'కిరాక్ పార్టీ'
  • ఈ నెలలో రిలీజ్ చేయాలనేది నిర్మాత ఆలోచన 
  • సమ్మర్ లో చేయమంటున్న నిఖిల్

నిఖిల్ కథానాయకుడిగా శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో 'కిరాక్ పార్టీ'  చిత్రం రూపొందింది. అనిల్ సుంకర నిర్మించిన ఈ సినిమాను ఈ నెలలోనే విడుదల చేయాలనుకున్నారు. ఈ నెల 16వ తేదీన గానీ .. 24వ తేదీన గాని ఈ సినిమాను విడుదల చేస్తే బాగుంటుందని ఆయన భావించారు. అయితే ఈ విషయంలో నిఖిల్ కాస్త అసంతృప్తితో వున్నాడని వినికిడి.

 ఈ సినిమా కంటెంట్ యూత్ కి సంబంధించింది. అందువలన వేసవి సెలవుల్లో ఈ సినిమాను రిలీజ్ చేయడమే అన్ని విధాలా మంచిదని ఆయన నిర్మాతను రిక్వెస్ట్ చేస్తున్నాడట. దాంతో ఆ దిశగా అనిల్ సుంకర ఆలోచిస్తున్నారని అంటున్నారు. ఈ సినిమాలో నిఖిల్ జోడీగా సంయుక్త హెగ్డే నటించింది. ఈ సినిమా తన కెరియర్లో చెప్పుకోదగిన సినిమా అవుతుందనీ, తనకి తప్పకుండా హిట్ ఇస్తుందనే నమ్మకంతో ఆయన వున్నాడు. సంయుక్త హెగ్డే కూడా ఈ సినిమా తన కెరియర్ కి కలిసి వస్తుందనే ఆశతో వుంది.     

More Telugu News