Undrer-19 world cup: అండర్-19 ప్రపంచకప్: విజృంభిస్తున్న ఇషాన్.. 59 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన ఆసీస్

  • బంతితో నిప్పులు చెరుగుతున్న ఇషాన్ పోరెల్
  • మూడు కీలక వికెట్లు కోల్పోయిన కంగారూలు
  • పట్టుబిగుస్తున్న భారత బౌలర్లు

న్యూజిలాండ్‌లో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న అండర్-19 ప్రపంచకప్ ఫైనల్‌లో భారత బౌలర్లు విజృంభిస్తున్నారు. నిప్పులు చెరిగే బంతులతో ఆసీస్‌ను వణికిస్తున్నారు. సెమీ ఫైనల్లో పాక్‌ వెన్ను విరిచిన ఇషాన్ పోరెల్ ఈ మ్యాచ్‌లోనూ విజృంభిస్తున్నాడు. ఓపెనర్లు ఇద్దరినీ పెవిలియన్ పంపాడు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్‌ జాగ్రత్తగా ఆడుతున్న తరుణంలో జట్టు స్కోరు 32 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఓపెనర్ జాక్ ఎడ్వర్డ్స్‌(28) ను ఇషాన్ పోరెల్ ఔట్ చేశాడు. దీనికి మరో 20 పరుగులు జోడించాక మళ్లీ ఇషాన్ బౌలింగ్‌లోనే మరో ఓపెనర్ మాక్స్ బ్రయంట్ (14) అభిషేక్ శర్మకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. కెప్టెన్ జాసన్ సంఘా (13)ను కమలేష్ నాగర్‌కోటి పెవిలియన్ పంపాడు. ప్రస్తుతం 16 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా మూడు వికెట్ల నష్టానికి 78 పరుగులు చేసింది. జొనాథన్ మెర్లో, పరమ్ ఉప్పల్ క్రీజులో ఉన్నారు.

More Telugu News