Prakash Raj: పుస్తకం రాసిన సినీనటుడు ప్రకాశ్‌రాజ్‌!

  • 'ఇరువుదెల్లవ బిట్టు' అనే పేరుతో పుస్తకం
  • ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకోండని ప్రకాశ్‌రాజ్‌ ట్వీట్‌
  • ఎల్లుండి విడుదల చేస్తున్నానని ప్రకటన

సినీనటుడు ప్రకాశ్ రాజ్ ఓ పుస్తకాన్ని రాశారు. తన మాతృ భాష కన్నడలో 'ఇరువుదెల్లవ బిట్టు' అనే పుస్తకాన్ని రాశానని, ఎల్లుండి విడుదల చేస్తున్నానని, నవకర్ణాటక ఆన్ లైన్ వెబ్ సైట్, అమెజాన్‌, ఫ్లిప్ కార్ట్‌లో అందుబాటులో ఉంచుతున్నానని చెప్పారు. ఈ పుస్తకాన్ని అందరూ కొనుగోలు చేయండని కోరారు. కాగా, కొన్ని నెలలుగా బీజేపీపై మండిపడుతోన్న ప్రకాశ్ రాజ్ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చాలా సార్లు వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఆయనపై పలు సార్లు బీజేపీ నేతలు కూడా మండిపడ్డారు.

More Telugu News