manchu vishnu: మరో దర్శకుడితో కొత్త ప్రాజెక్ట్ ను సెట్ చేసిన మంచు విష్ణు

  • విజయ్ దేవరకొండతో పరశురామ్ 
  • తరువాత సినిమా మంచు విష్ణుతో 
  • విష్ణు సొంత బ్యానర్లోనే ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్    

యాక్షన్ కామెడీతో కూడిన కథాంశాలకి ప్రాధాన్యతనిస్తూ మంచు విష్ణు ముందుకు వెళుతున్నాడు. త్వరలో ఆయన నుంచి 'ఆచారి అమెరికా యాత్ర' .. 'ఓటర్' రానున్నాయి. ఈ సినిమాల తరువాత ఆయన పరశురామ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నట్టు తెలుస్తోంది.

'శ్రీరస్తు శుభమస్తు' సినిమాతో అల్లు శిరీష్ కి హిట్ ఇచ్చిన పరశురామ్, ప్రస్తుతం అల్లు అరవింద్ నిర్మాతగా విజయ్ దేవరకొండతో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తికాగానే ఆయన మంచు విష్ణుతో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడు. మంచు విష్ణు సొంత బ్యానర్లో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందనుంది. ఈ కథ విష్ణుకు బాగా నచ్చేసిందనీ, తన కెరియర్లో ఇంతవరకూ చేస్తూ వచ్చిన కథలకు ఇది పూర్తి భిన్నంగా ఉందని విష్ణు నమ్ముతున్నాడట. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మిగతా వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. 

More Telugu News