acid: లాడ్జిలో భార్యపై భర్త యాసిడ్ దాడి!

  • నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కసుమూరులో ఘటన
  • నిన్న రాత్రి కసుమూరులోని లాడ్జిలో దిగిన దంపతులు
  • పొదలకూరుకు చెందిన దంపతులుగా గుర్తింపు
  • కుటుంబ కలహాలతో దాడి.. బాధితురాలికి ఆసుపత్రిలో చికిత్స

నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కసుమూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యను తీసుకుని నిన్న రాత్రి కసుమూరులోని ఓ లాడ్జికి వచ్చాడు. అయితే, లాడ్జిలో భార్యపై యాసిడ్‌తో దాడి చేసి అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. పథకం ప్రకారమే ఆ వ్యక్తి ఈ ఘటనకు పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనపై లాడ్జి సిబ్బంది అందించిన సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న పోలీసులు బాధితురాలు సభానాను ఆసుపత్రికి తరలించారు. ఆ దంపతులు పొదలకూరుకు చెందిన వారని గుర్తించారు. కుటుంబ కలహాల కారణంగానే భార్యపై భర్త యాసిడ్ పోశాడని, నెల్లూరు ప్రభుత్వాసుపత్రిలో ఆమెకు చికిత్స అందుతోందని తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నాడు.          

More Telugu News