medaram: మేడారం జాతరకు రానున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

  • రేపు మేడారం చేరుకోనున్న వెంకయ్యనాయుడు
  • వనదేవతల దర్శనానంతరం అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన
  • శని, ఆదివారాల్లో గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పర్యటించనున్న ఉపరాష్ట్రపతి

మేడారం జాతరకు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు రానున్నారు. రేపు మేడారం చేరుకుని వనదేవతలను దర్శించుకోనున్నారు. అనంతరం, పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. శనివారం ఉదయం గుంటూరు జిల్లా పెదనందిపాడులోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ లో నిర్వహించే స్వర్ణజయంతి ఉత్సవాలకు ఆయన హాజరవుతారు. ఆదివారం ఉదయం కృష్ణా జిల్లా ఆత్కూరులో స్వర్ణ భారత్ ట్రస్ట్ రెండో వార్షికోత్సవంలో వెంకయ్యనాయుడు పాల్గొంటారు.  

More Telugu News