avanthi srinivas: సహనానికి ఓ హద్దు ఉంటుంది.. మాకు పదవులు ముఖ్యం కాదు: టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్‌

  • నాలుగేళ్లయినా నిధులు ఇవ్వడం లేదు 
  • రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీలేదు
  • ప్రజల మనోభావాలను అర్థం చేసుకోవాలి
  • నాలుగేళ్లుగా సహనంతో ఉన్నాం

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఈ రోజు పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై టీడీపీ ఎంపీలు భగ్గుమంటున్నారు. ఢిల్లీలో టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పిందని, నాలుగేళ్లయినా నిధులు ఇవ్వలేదని విమర్శించారు. తమకు పదవులు ముఖ్యం కాదని, ఓర్పు, సహనానికి ఓ హద్దు ఉంటుందని, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీలేదని చెప్పారు. ఏపీ ప్రజల మనోభావాలను కేంద్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాలని అన్నారు. తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ కాబట్టి నాలుగేళ్లుగా సహనంతో ఉన్నామన్నారు.  

More Telugu News