yanamala: ఏపీకి సంబంధించిన అంశాలను బడ్జెట్ లో ప్రసంగించలేదు!: ఏపీ ఆర్థిక మంత్రి యనమల

  • విశాఖ, విజయవాడ ‘మెట్రో’ గురించిన ప్రస్తావన ఉందో? లేదో?
  • బడ్జెట్ ను పూర్తిగా పరిశీలించిన తర్వాతే ఈ విషయం తెలుస్తుంది
  • భారత్ మాల, కోస్టల్ కారిడార్ల వల్ల రాష్ట్రానికి లబ్ధి చేకూరుతుందన్న యనమల

ఏపీకి సంబంధించిన అంశాలను బడ్జెట్ లో ప్రసంగించలేదని ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రానికి సంబంధించిన అంశాలను బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించలేదని, విశాఖ, విజయవాడ ‘మెట్రో’ గురించిన ప్రస్తావన ఉందా? లేదా? అనే విషయం బడ్జెట్ ప్రతులను పూర్తిగా పరిశీలించిన తర్వాతే తెలుస్తుందని అన్నారు.

కర్ణాటక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలున్నందున బెంగళూరు ‘మెట్రో’ అంశాన్ని బడ్జెట్ లో ప్రస్తావించారని అన్నారు. భారత్ మాల, కోస్టల్ కారిడార్ల వల్ల రాష్ట్రానికి లబ్ధి చేకూరుతుందని, ఎంఎస్ఎంఈ లు (మినిస్ట్రీ ఆఫ్ మైక్రో, స్మాల్ & మీడియం ఎంటర్ ప్రైజెస్)పై ప్రత్యేక దృష్టి పెట్టారని, రాష్ట్రంలో ఎంఎస్ఎంఈలను పునరుద్ధరించే అవకాశం లభిస్తుందని, బడ్జెట్ ప్రసంగం వేరు, బడ్జెట్ వివరాలు వేరని, కేంద్రం ముందస్తు ఎన్నికలకు వస్తే ఇదే చివరి బడ్జెట్ అవుతుందని యనమల అన్నారు.

More Telugu News