Parliament: 2022 నాటికి దేశంలోని ప్రతి పౌరుడికీ సొంత ఇల్లు... వ్యవసాయం, గ్రామీణ రంగాలకు పెద్దపీట... అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగం ముఖ్యాంశాలు - 1

  • తొలి మూడేళ్లలో సగటున 7.5 శాతం వృద్ధి
  • ప్రపంచంలోనే 7వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగాం
  • వ్యవసాయం, గ్రామీణ రంగాలకు పెద్దపీట
  • పట్టాలెక్కిన తయారీ రంగం
  • పార్లమెంటులో కొనసాగుతున్న బడ్జెట్ ప్రసంగం

కొద్దిసేపటి క్రితం పార్లమెంట్ లో అరుణ్ జైట్లీ 2018-19 బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు...
* సాహసోపేత నిర్ణయాలు తీసుకుని పేదరికాన్ని నిర్మూలిస్తామని హామీ ఇచ్చాం
* నిజాయితీ, పారదర్శక విధానాలతో ఎంతో మార్పు వచ్చింది
* మోదీ సంస్కరణలతో వృద్ధి రేటు పెరిగింది
* మరిన్ని విదేశీ పెట్టుబడులు దేశంలోకి వస్తున్నాయి.
* తొలి మూడేళ్లలో సగటున 7.5 శాతం వృద్ధి.
* ఈ సంవత్సరం స్థూల ఆర్థిక వృద్ధి పెరుగుతుంది.
* ప్రస్తుతం భారత్ 2.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ.
* ప్రపంచంలోనే 7వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగాం.
* అతి త్వరలో ఐదో ఆర్థిక శక్తి ఇండియానే.

* ఈ ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు 15 శాతం పెరుగుతాయి.
* వ్యవసాయం, గ్రామీణ రంగాలకు పెద్దపీట.
* విద్యకు, సీనియర్ సిటిజన్లకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించాం
* సౌభాగ్య పథకంతో లక్షల కుటుంబాల్లో వెలుగులు నింపాం.
* 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే సర్కారు లక్ష్యం
* పలు పథకాలను నేరుగా లబ్దిదారులకే అందిస్తున్నాము.
* రైతుల ఉత్పాదకతను పెంచే చర్యలు చేపడుతున్నాం.
* వారికి దిగుబడిని, గిట్టుబాటు ధర కల్పించేందుకు కృషి.
* ధాన్యం పప్పు దినుసుల మద్దతు ధరను ఒకటిన్నర రెట్లు పెంచాం.
* నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల దీర్ఘకాలిక ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి.
* ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించాయి.
* నల్లధనాన్ని అరికట్టడంలో తొలి అడుగులు పడ్డాయి. మరిన్ని నిర్ణయాలు తీసుకుంటాం.
* పెట్టుబడులను పెంచుతూ, వృద్ధికి సహకరించేలా సంస్కరణలు తీసుకొస్తాం.
* తయారీ రంగంలో వృద్ధి రేటు తిరిగి పట్టాలెక్కింది. ఈ రంగంలో వృద్ధి రేటు ఇప్పుడు 8 శాతం.

* రెండు రోజుల్లో పాస్ పోర్టు మంజూరు చేయడం ఓ గొప్ప విజయం.
* ఒక్క రోజులోనే కంపెనీ రిజిస్ట్రేషన్ ను చేసి చూపించాం.
* ప్రత్యక్ష పన్నుల రాబడి ప్రయోజనం పేదలకు దక్కుతోంది.
* నగదు బదిలీలో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా చేశాం.
* దేశంలో అవినీతి తగ్గిపోయింది.
* గత కొన్నేళ్లుగా అమలు చేస్తున్న సంస్కరణల ఫలితాలు ఇప్పుడిప్పుడే అందుతున్నాయి.
* డిజిటలైజేషన్ తో ఆర్థిక వ్యవస్థలో పారదర్శకత ఏర్పడింది.
* బ్యాంకుల పునర్ వ్యవస్థీకరణ కొత్త సంస్కరణలకు నాంది పలికింది.

* వ్యవసాయం, విద్య, వైద్యం, ఆరోగ్యం, పోషకాహారంపై ప్రధానంగా దృష్టి పెట్టాం.
* అన్ని మంత్రిత్వ శాఖల సమన్వయంతో ఒకే యంత్రాంగం ఏర్పాటు.
* గ్రామీణ వ్యవసాయ మార్కెట్లకు రూ. 2 వేల కోట్లు.
* రైతుల కోసం జిల్లాల్లో క్లస్టర్ల ఏర్పాటు.
* వ్యవసాయ ఉత్పత్తుల కోసం పటిష్ఠమైన క్లస్టర్ విధానం.
* ఆహార శుద్ధి, వాణిజ్య శాఖలతో కలసి వ్యవసాయ ఉత్పత్తుల క్లస్టర్లు.
* సేంద్రీయ వ్యవసాయం చేసే రైతులకు మరింత ప్రాధాన్యం.
* సేంద్రీయ వ్యవసాయం చేసేలా మహిళా సంఘాలకు ప్రోత్సాహం.
* పర్ ఫ్యూమ్ ఆయిల్స్ కోసం రూ. 200 కోట్లు.
* ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనకు రూ. 1,400 కోట్లు.
* ఆపరేషన్ గ్రీన్ కోసం రూ. 500 కోట్లు.

* 42 మెగా ఫుడ్ పార్కులను పటిష్ఠం చేసేందుకు కృషి.
* ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనతో మరిన్ని రహదారుల అనుసంధానం
* మరో నాలుగేళ్లలో అన్ని గ్రామాలకూ పక్కా రహదారులు.
* 2017-18లో ఎగుమతులు 17 శాతం.
* వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్లో సరళీకరణ.
* రైతులందరికీ కిసాన్ క్రెడిట్ కార్డుల మంజూరు.
* పాడి, ఆక్వా రైతులకు కూడా కిసాన్ క్రెడిట్ కార్డులు.
* పశు సంవర్థక, ఆక్వా అభివృద్ధికి రూ. 10 వేల కోట్లు.

* దేశ రాజధానిలో కాలుష్య నియంత్రణకు ప్రత్యేక చర్యలు.
* పేదలకు ప్రయోజనకరంగా ఉండేలా స్వచ్ఛ భారత్ అభియాన్.
* మహిళల హుందాతనాన్ని కాపాడుతున్న శౌచాలయాల నిర్మాణం.
* 2022 నాటికి దేశంలోని ప్రతి పౌరుడికీ సొంత ఇల్లు.
* 2019 నాటికి మహిళా సంఘాలకు రూ. 75 వేల కోట్ల రుణాలు
* వెదురు పరిశ్రమ ప్రోత్సాహం కోసం రూ. 1,200 కోట్లు.
* నీటి వసతి లేని 96 జిల్లాల కోసం ప్రత్యేక నిధి.
* ఇప్పటికే 8 కోట్ల మంది మహిళలకు ఉచిత వంట గ్యాస్ కనెక్షన్లు.
* జాతీయ జీవనోపాధి మిషన్ కోసం రూ. 5,750 కోట్లు.
* విద్యా వ్యవస్థలో ప్రమాణాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
* నాణ్యమైన విద్యా బోధన కోసం మరింత కృషి.

More Telugu News