samsung: ఫోల్డబుల్ ఓఎల్ఈడీ స్మార్ట్ ఫోన్లు ఈ ఏడాదిలోనే మార్కెట్లోకి... ధ్రువీకరించిన శామ్ సంగ్

  • ఈ ఏడాదిలోనే తీసుకువచ్చే ఆలోచన
  • 2018 రోడ్ మ్యాప్ ను ఆవిష్కరించిన శామ్ సంగ్
  • స్మార్ట్ ఫోన్లలో ఇది కొత్త టెక్నాలజీయే

స్మార్ట్ ఫోన్లలో శామ్ సంగ్ కొత్త ఆవిష్కరణలకు తెరతీయనుంది. స్మార్ట్ ఫోన్లను ఓఎల్ఈడీ డిస్ ప్లేతో మడిచిపెట్టుకునేందుకు వీలుగా తయారు చేసే ప్రణాళికతో ఉన్నట్టు ప్రకటించింది. ఈ ఏడాదిలోనే వీటిని అందుబాటులోకి తీసుకురావాలన్న ఆలోచనతో ఉంది. అలాగే, తన ఫ్లాగ్ షిప్ ఫోన్ అయిన గెలాక్సీ ఎస్9పై దృష్టి పెట్టనున్నట్టు పేర్కొంది.

ఈ మేరకు 2018 సంవత్సరానికి సంబంధించిన రోడ్ మ్యాప్ ను సంస్థ నాలుగో క్వార్టర్ (డిసెంబర్) ఫలితాల విడుదల సందర్భంగా ఆవిష్కరించింది. స్మార్ట్ ఫోన్లను కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీతో, ఓఎల్ఈడీ డిస్ ప్లేతో తీసుకువచ్చే ప్రయత్నాలను కొనసాగించనున్నట్టు పేర్కొంది. ఇక ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి వాటిపైనా దృష్టి సారించాలని సంస్థ నిర్ణయించింది.

More Telugu News