awe: ‘అ!’ సినిమా ట్రైలర్ విడుదల

  • విభిన్నమైన కాన్సెప్ట్‌తో ‘అ!’
  • అదిరిపోయిన డైలాగులు
  • వచ్చేనెల 16న సినిమా విడుదల

ప్రశాంత్‌ త్రిపురనేని నిర్మిస్తోన్న ‘అ!’ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమాను విభిన్నమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో వినపడుతోన్న డైలాగులు అలరిస్తున్నాయి. ‘చేపలకు కూడా క‌న్నీళ్లు ఉంటాయ్‌ బాస్‌. నీళ్లలో ఉంటామ్‌ కదా.. కనపడవంతే..’ అంటూ చేపగా నాని చెప్పిన డైలాగ్ అదుర్స్ అనిపిస్తోంది. ఈ సినిమాకు ప్రశాంత్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో కాజల్‌, నిత్యామేనన్‌, రెజీనా, ఇషారెబ్బ, శ్రీనివాస్‌ అవసరాల, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా వచ్చేనెల 16న విడుదల కానుంది. వాల్‌పోస్టర్‌ సినిమా పతాకంపై నాని ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.    

More Telugu News