nagashourya: నాగశౌర్య తదుపరి సినిమాకి సన్నాహాలు

  • నాగశౌర్య తదుపరి చిత్రానికి సన్నాహాలు 
  • దర్శకుడిగా సాయిశ్రీరామ్ 
  • కథానాయికగా నివేదా థామస్

నాగశౌర్య తాజా చిత్రంగా 'ఛలో' ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. సొంత బ్యానర్లో రూపొందిన ఈ సినిమాపై నాగశౌర్య ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమా విడుదలకి రెడీ అవుతూ ఉండగానే, మరో సినిమాను పట్టాలెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

సాయి శ్రీరామ్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా, ఫిబ్రవరి నెలాఖరులో సెట్స్ పైకి వెళ్లనుంది. మన్యం విజయ్ కుమార్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో కథానాయికగా నివేదా థామస్ ను ఎంపిక చేశారు. పూర్తిస్థాయి ప్రేమకథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా తరువాత నాగశౌర్య సొంత బ్యానర్లో మరో సినిమా చేయనున్నట్టు తెలుస్తోంది. శ్రీనివాస్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాకి, 'నర్తనశాల' అనే టైటిల్ ను ఖరారు చేశారు.     

More Telugu News